హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ సవాంగ్‌

అక్రమ మద్యం రవాణాలో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టువిచారణకు డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడం

Updated : 24 Jun 2020 11:55 IST

అమరావతి: అక్రమ మద్యం రవాణాలో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టువిచారణకు డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని న్యాయస్థానంలో నిన్న పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు డీజీపీ హాజరయ్యారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది.

మద్యం అక్రమ రవాణాచేస్తూ జప్తునకు గురైన వాహనాల్ని సంబంధితమెజిస్ట్రేట్/ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ముందు ఎందుకు ఉంచడం లేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నిన్నటి విచారణలో ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు వాహనాల్ని జప్తుచేశారని, వాటిని విడుదలచేసేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై న్యాయమూర్తి సోమవారం విచారణ జరిపి డీజీపీని సుమోటో ప్రతివాదిగా చేర్చారు. డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని