పర్యాటక సందడి ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో బోటింగ్ మొదలైంది.
హుస్సేన్సాగర్లో మొదలైన బోటింగ్
నాగార్జున సాగర్లో నేటి నుంచి..
హైదరాబాద్; నాగార్జునసాగర్, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో బోటింగ్ మొదలైంది. వాటర్ ఫౌంటెయిన్కు అనుమతిచ్చారు. 6 నెలల తర్వాత మొదలైన వీటిల్లో తొలిరోజు కొన్ని చోట్ల సందర్శకుల సందడి కనిపించింది. పర్యాటకశాఖ బస్సులకు బుకింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ శిల్పారామంలో గురువారం పలు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం దీనిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల మేరకు పర్యాటక కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలు నడుస్తాయని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. దుర్గం చెరువు సహా రాష్ట్రంలోని పర్యాటక జలాశయాల వద్ద బోటింగ్ను ప్రారంభిస్తామన్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీ ప్రయాణాలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. హిల్కాలనీ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన లాంచీ స్టేషన్ నుంచి.. నాగార్జునకొండకు, జలాశయంలో సరదా ట్రిప్పుల కోసం రెండు లాంచీలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా రూ.50 లక్షలతో మరో లాంచీని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు