AP News: విశాఖలో మరో పది బీచ్లు
విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది.
విశాఖ పోర్టు సాయంతో తొలిదశలో ఐదు అభివృద్ధి
ఒక్కో బీచ్లో రూ.2.50కోట్లతో సదుపాయాలు
ఏపీటీడీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఒక్కో బీచ్ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్లను సిద్ధం చేయనున్నారు. రెండోదశలో మిగతావి అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఆర్కేబీచ్, రుషికొండ, యారాడ బీచ్లు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలకు లోబడి ఆయా బీచ్ల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు తెలుపుతున్నారు.
కొత్త బీచ్లు ఇవే
1. సాగర్నగర్, 2. తిమ్మాపురం, 3. మంగమూరిపేట, 4. చేపలుప్పాడ, 5. ఐఎన్ఎస్ కళింగ, 6. ఎర్రమట్టి దిబ్బలు, 7. భీమునిపట్నం, 8. నాగాయంపాలెం, 9. అన్నవరం, 10. కంచేరుపాలెం
కల్పించే సదుపాయాలు
ఫుడ్ కోర్టులు, పిల్లల క్రీడా పార్కులు. నడక మార్గాలు, ఫిట్నెస్కు సంబంధించిన పరికరాలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్ జోన్లు, బీచ్ క్రీడలు, వాచ్ టవర్, సీసీ టీవీ కంట్రోల్ రూం, ప్రాథమిక వైద్యం.
కొత్త ప్రాజెక్టులకు ఆస్కారం
విశాఖ-భోగాపురం తీర ప్రాంతం పొడవునా ఫ్లోటింగ్ రెస్టారెంట్, బుద్ధిస్టు పర్యాటకాన్ని పెంచడం, రీక్రియేషన్ టూరిజం కోసం ఉల్లాస పార్కులు, స్కైటవర్, టన్నెల్ అక్వేరియం వంటివి అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత విలాసవంతమైన హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
విశాఖలో కొత్త బీచ్లను గుర్తించాం. వాటి అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. మొదటిదశలో అభివృద్ధి చేయాల్సిన వాటిపై దృష్టి సారించాం. అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తాం. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దుతాం. రుషికొండ బ్లూ ఫ్లాగ్ ప్రాజెక్టు మాదిరి మిగిలిన వాటిని అభివృద్ధి చేస్తాం. విశాఖలో మరికొన్ని బీచ్లను బ్లూ ఫ్లాగ్ కోసం ప్రతిపాదనలు పంపుతాం. - ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు