Floods: జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకొని తండ్రీకుమారుడు గల్లంతు

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో గొల్లపల్లి మండలం మల్లనపేట

Updated : 07 Sep 2021 13:55 IST

గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో గొల్లపల్లి మండలం మల్లన్నపేట వాగులో చిక్కుకొని నందిపల్లికి చెందిన తండ్రీకుమారుడు గల్లంతయ్యారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టగా.. బాలుడు విష్ణు మృతదేహం లభ్యమైంది. చిన్నారి తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని