TS News: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ 

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది.

Updated : 24 Jul 2021 16:23 IST

భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఈ ఉదయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సహాయం కోసం 93929 19743 నంబరుకు ఫొటోలు వాట్సాఫ్‌ చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజల అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 08744 241950, 08743 23244 సంప్రదించాలని అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని