AP News: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.
ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. పదవులేవీ అలంకారప్రాయం కాదని అన్నారు. ఈ ప్రక్రియలో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 76 పదవులు కేటాయించామన్నారు. వెనుకబడిన తరగతులకు 56 శాతం పదవులు కేటాయించినట్లు వివరించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు.
పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్గా ద్వారంపూడి భాస్కర్రెడ్డి, వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ ఛైర్పర్సన్గా గాదల బంగారమ్మ, గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్గా రెడ్డి పద్మావతి, మారిటైం బోర్టు ఛైర్మన్గా విజయనగరం జిల్లాకు చెందిన కాయల వెంకట్రెడ్డి, టిడ్కో ఛైర్మన్గా జమ్మాన ప్రసన్నకుమార్, డీసీసీబీ ఛైర్మన్గా నెక్కల నాయుడుబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా అడపా శేషగిరి, ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ ఛైర్మన్గా ఎన్.రామారావు, ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్రావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్స్న్గా నరమల్లి పద్మజ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్గా నసీర్ అహ్మద్, బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్గా సుధాకర్, ఏపీఐఐసీ ఛైర్మన్గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ