TS News: తెలంగాణలో 62కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ

Updated : 28 Dec 2021 22:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని వెల్లడించారు. ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేని ఓ ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక ప్రెగ్నెంట్‌ మహిళ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్క్రీనింగ్‌ చేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

 కొత్తగా 228 కరోనా కేసులు.. ఒకరి మృతి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 185 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,828 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని