Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. లోకేశ్ పాదయాత్ర... తెదేపా విజయయాత్ర..!
రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది. వైకాపా అరాచకాలను ఎండగట్టడం, తెదేపాను మరింతగా ప్రజలకు చేరువ చేయడం, పార్టీలో యువనాయకత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేశ్ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. పూర్తి కథనం
2. ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఇండియా’
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి సవాల్ విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీ భాజపాకు దక్కకుండా నిలువరించగలిగాయిపూర్తి కథనం
3. రాశి.. వాసితో కమల వికాసం
రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. పదేళ్లలో పార్టీ రాష్ట్రంలో ఓట్లను... సీట్లను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి ఎనిమిది చోట్ల నెగ్గి.. మరో ఏడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది.పూర్తి కథనం
4. పవన్ శక్తి... వర్మ యుక్తి
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. చివరకు దత్తాత్రేయ జన్మస్థలమైన పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ అప్పటికే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.పూర్తి కథనం
5. గులకరాయి గురితప్పింది!
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెదేపాపై అభాండాలు మోపి... రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడికత్తి దాడి ఘటనను అడ్డం పెట్టుకున్న జగన్మోహన్రెడ్డి ఈసారి గులకరాయి ఘటనను అలాగే మలుచుకునేందుకు యత్నించారు. గులకరాయి తగిలిందని తనపై హత్యాయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు. నుదుటిపై బ్యాండేజీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు.పూర్తి కథనం
6. జగన్.. 11.. 11.. దేవుడి స్క్రిప్ట్ ఇదీ?
సీఎం జగన్కు దేవుడి స్క్రిప్ట్ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు. 1+6+4 మొత్తం 11 అవుతుంది. ఇదీ దేవుడి స్క్రిప్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు.పూర్తి కథనం
7. 5 లక్షలు.. 4 లక్షలు.. 3 లక్షలు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది. ఉమ్మడి ఏపీ సహా విభజన తర్వాత సైతం తెలుగు రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎవరికీ రానంతగా 5.59 లక్షల మెజార్టీతో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. పూర్తి కథనం
8. హ్యాట్రిక్ విజయంతో నెహ్రూ, ఇందిర, వాజ్పేయీల సరసన మోదీ
హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానుల వివరాలను పరిశీలిస్తే...పూర్తి కథనం
9. ఓడింది జగన్రెడ్డే కాదు.. జవహర్రెడ్డి కూడా..!
ఈ ఎన్నికల్లో వైకాపాకు ఎదురైన ఘోర పరాభవం కేవలం జగన్దే అనుకుంటే పొరపాటు! ఆయన సహచరుడు.. కాదు కాదు.. ఆయనకు పూర్తిస్థాయి అనుచరుడిగా మారిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిది కూడా! రాష్ట్ర చరిత్రలోనే ఇంతగా వివాదాస్పదమైన, ఆరోపణలకుగురైన, అధికార పార్టీతో అంటకాగిన అధికారి మరొకరు లేరు.పూర్తి కథనం
10. తల్లిని మించిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్ప్రదేశ్లో హస్తం పార్టీ కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్ ప్రతాప్ సింగ్పై 3,90,030 ఓట్ల ఆధిక్యంతో ఆయన నెగ్గారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియాగాంధీ సాధించిన 1,67,178 ఓట్ల మెజారిటీని రాహుల్ అధిగమించారు.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి