Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. వారం రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు: మంత్రివర్గ ఉప సంఘం
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేసి.. వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రి వర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో సమావేశమై చర్చించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. విశాఖ ఆర్కే బీచ్లో శ్వేత మృతదేహం.. వీడిన మిస్టరీ
విశాఖ ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి.. ఆర్కే బీచ్లో శవమై కనిపించినప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జూన్5కు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర తెలిపారు. ఇవాళ వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలు కాదన్నారు. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్ 5కు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. 100 ఎపిసోడ్ల ‘మన్ కీ బాత్’.. ప్రధాని మోదీ నోట.. తెలుగు ఘనకీర్తి మాట!
ప్రతినెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలవుతూనే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాజకీయం గురించి మాట్లాడాలనుంది.. కానీ అది వద్దంటోంది: రజనీకాంత్
‘ఇంత పెద్ద సభను చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనుందని, కానీ, అనుభవం వద్దని ఆపుతోంది’ అని ప్రముఖ హీరో రజనీకాంత్ (Rajinikanth) అన్నారు. విజయవాడ వేదికగా నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల శంఖారావానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అనురాగ్ ఠాకూర్ మా కాల్స్కు బదులివ్వడం లేదు: రెజ్లర్లు
లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ (Brij Bhushan Sharan Singh)ను వెంటనే జైల్లో పెట్టాలని రెజ్లర్లు(wrestlers) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనపై కేసు నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో.. రెజ్లర్ల నుంచి ఈ స్పందన వచ్చింది. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేసేవరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎల్ఐసీ ఛైర్మన్గా సిద్ధార్థ మొహంతి
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) ఛైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎల్ఐసీ ఛైర్మన్గా వ్యవహరించిన ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తయిన నేపథ్యంలో మొహంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మొహంతి ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా, యాక్టింగ్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చీతాల మృతి.. దక్షిణాఫ్రికా స్పందన ఇదే!
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు (Kuno national Park)లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా (Cheetah) మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ (DFFE) స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. బీబీసీ ఛైర్మన్ రాజీనామా.. బోరిస్ జాన్సన్ రుణ వివాదమే కారణం!
బ్రిటన్ (Britain)కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ (BBC)’ ఛైర్మన్ రిచర్డ్ షార్ప్ (Richard Sharp) తన పదవికి రాజీనామా చేశారు. 2021లో అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson)కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మళ్లీ టీమ్లకు గాయాల బెడద.. కీలక సమయంలో తప్పని కష్టాలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సగం మ్యాచ్లు ముగిశాయి. ప్లేఆఫ్స్ కోసం ఇప్పుడే అసలైన సమరం మొదులకానుంది. ఈ క్రమంలో రూ.కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు కీలక మ్యాచ్లకు దూరమైతే ఆయా ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం. లీగ్ ప్రారంభానికి ముందే వైదొలిగితే.. అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి మ్యాచ్లకు సన్నద్ధం చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత