Vizag: విశాఖ ఆర్కే బీచ్లో శ్వేత మృతదేహం.. వీడిన మిస్టరీ
విశాఖ ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది.
విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి.. ఆర్కే బీచ్లో శవమై కనిపించినప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరించారు.
‘‘శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చెందిన శ్వేతకు ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గురుమిల్ల మణికంఠతో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. పదిహేను రోజుల క్రితం కార్యాలయ పనిపై మణికంఠ హైదరాబాద్ వెళ్లారు. అత్తమామలతో కలిసి ఉంటున్న శ్వేత మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 8.20 నుంచి 8.32 వరకు భర్తతో భర్తతో ఫోన్లో మాట్లాడింది. అనంతరం సూసైడ్ నోట్ను గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లి పోయింది. శ్వేత పేరుపై కోటబొమ్మాళిలో ఉన్న 90 సెంట్ల భూమి.. తన పేరుపై రాయాలని భర్త మణికంఠ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడు’’
‘‘శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినప్పుడు ఆమె తల్లి ఎదుటే భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. తన తల్లి ఎదుటే మణికంఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. అప్పుడే ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లి కాపాడింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శ్వేత ఆడపడుచులిద్దరూ వారి ఇంటికి సమీపంలోనే ఉంటారు. వారు తరచూ ఇంటికి వచ్చి భర్త లేని సమయంలో శ్వేతను వేధిస్తుండే వారు. ఇటీవల జరిగిన పరిణామాలు, సూసైడ్ నోట్ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యేనని భావిస్తున్నాం. శ్వేత శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది’’ అని సీపీ వెల్లడించారు.
సూసైడ్ నోట్ గుర్తించాం: సీపీ
‘నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం బాధ ఉండదని. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. న్యూ లైఫ్. చాలా మాట్లాడటానికి ఉన్నా కూడా.. నేను ఏమీ మాట్లాడడంలేదు. యూ నో ఎవ్రిథింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్’ అంటూ శ్వేత సూసైడ్ లేఖలో రాసి ఉంది. ‘ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్’ అంటూ స్మైలీ బొమ్మ వేసిన ఆ లేఖను శ్వేత గదిలో గుర్తించామని సీపీ తెలిపారు. లేఖలో దస్తూరి శ్వేతదేనని ఆమె తల్లి కూడా నిర్ధారించారని వెల్లడించారు.
మృతదేహం పడి ఉన్న తీరుపై అనుమానాలు..
బీచ్లో శ్వేత మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉండటం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రశ్నలపై సీపీ త్రివిక్రమ్ స్పందించారు. సముద్రం ఆటు పోట్ల కారణంగానే మృతదేహం ఆ ప్రాంతానికి కొట్టుకొచ్చిందని వెల్లడించారు. గతంలో కూడా రెండు మృతదేహాలు అదే ప్రాంతానికి కొట్టుకొచ్చాయని వెల్లడించారు. ఈ అంశంపై పర్యావరణ నిపుణులతో చర్చించిన తర్వాత, ఘటనా స్థలిలో లభ్యమైన ఆధారాలను బట్టి ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. చెప్పులు వదిలి వెళ్లిన ప్రాంతానికి 150 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైందన్నారు. శ్వేత శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా తేలిందన్నారు. శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు అత్త మామలు, భర్త, ఆడపడుచు భర్తపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలు సేకరించామని సీపీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు