BBC: బీబీసీ ఛైర్మన్ రాజీనామా.. బోరిస్ జాన్సన్ రుణ వివాదమే కారణం!
ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ’ ఛైర్మన్ రిచర్డ్ షార్ప్ తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్కు రుణం విషయంలో సహకరించడం తదితర విషయాలు దాచిపెట్టి.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ దర్యాప్తులో తేలడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
లండన్: బ్రిటన్ (Britain)కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘బీబీసీ (BBC)’ ఛైర్మన్ రిచర్డ్ షార్ప్ (Richard Sharp) తన పదవికి రాజీనామా చేశారు. 2021లో అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson)కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘బీబీసీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోకముందే.. తాను ఈ పదవి విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్కు చెప్పారు. ఆయనకు రూ.8 కోట్ల మేర రుణం ఇప్పించే విషయంలోనూ సాయం చేశారు. కానీ, బీబీసీ ఛైర్మన్ పదవి నియామకం సమయంలో ఈ విషయాలు వెల్లడించలేదు’ అని రిచర్డ్ షార్ప్పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు.. ప్రభుత్వ నియామకాల కమిషనర్ ఆదేశాలతో ఓ స్వతంత్ర దర్యాప్తు చేపట్టారు.
బీబీసీ ఛైర్మన్ పదవికి ఇంటర్వ్యూ సమయంలో రిచర్డ్ షార్ప్.. పైన పేర్కొన్న విషయాలను వెల్లడించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తన రాజీనామా ప్రకటించారు. బీబీసీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తదుపరి నియామకం వరకు పదవిలో కొనసాగుతానని వెల్లడించారు.
రిచర్డ్ షార్ప్ 2021లో బీబీసీ ఛైర్మన్గా నియమితులయ్యారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ ‘గోల్డ్మన్ శాక్స్’లో పనిచేస్తున్నప్పుడు.. రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)కు పైఅధికారిగా వ్యవహించారు. అయితే, రిషి సునాక్ ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. బీబీసీ ఛైర్మన్గా రిచర్డ్ షార్ప్ నియామకం.. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించకముందే జరిగినట్లు సునాక్ ఇటీవల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా