Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. చంద్రయాన్-3 మిషన్ వెనుక వీళ్ల కృషి..
జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 (Chadrayaan-3) వ్యోమనౌక అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. 41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సన్నద్ధమైంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 మిషన్లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. మరి, ఈ శాస్త్రవేత్తల బృందాలకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. సర్జరీ చేసి పొట్టలో దూది వదిలేసిన వైద్యులు.. బాలింత మృతి!
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత మృతి చెందింది. దర్శన్గడ్డ తండాకు చెందిన గిరిజన మహిళ రోజా నిండు గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 15న అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించారు. ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజున కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వైద్యులు.. పొరపాటున కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. అనంతరం రోజాను డిశ్ఛార్జి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రష్యా సూపర్సానిక్ లాంగ్రేంజి బాంబర్ ధ్వంసం..!
రష్యా(Russia)లోని కీలక స్థావరాలపై ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్లు డాడులు చేసి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. తాజగా రష్యాకు చెందిన సూపర్ సానిక్ విమానాలుండే షైకోవ్కా స్థావరంపై భారీగా బాంబింగ్ జరిగింది. ఇది ఉక్రెయిన్ సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత వారాంతంలో నోవ్గ్రోడ్లోని స్లాట్సీ మిలిటరీ ఎయిర్ఫీల్డ్ పై కూడా దాడి జరిగినట్లు రష్యా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పలు వరసల్లోని రష్యా రక్షణ వ్యవస్థలను దాటుకొని వచ్చి ఉక్రెయిన్ డ్రోన్లు ఈ దాడులు చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. నేను బతికే ఉన్నా.. అలాంటి రూమర్స్ బాధించాయి: హీత్ స్ట్రీక్
తాను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంపై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి కథనాలు మానసికంగా బాధకు గురి చేశాయని పేర్కొన్నాడు. తాను క్యాన్సర్తో పోరాడుతూనే ఉన్నానని, బతికే ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘‘నేను కన్నుమూసినట్లు వచ్చిన వార్తలన్నీ రూమర్లే. అదంతా అబద్ధం. బతికే ఉన్నా. చాలా బాగున్నా. ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఇలాంటి విషయాన్ని వ్యాప్తి చేయడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సయామీ ఖేర్ ‘వైవిధ్య’ బౌలింగ్.. అద్భుతమన్న సచిన్.. వీడియో వైరల్!
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఎంతో మందికి స్ఫూర్తి. అతడికి అభిమానులు భారీ సంఖ్యలోనే ఉంటారు. వారిలో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ (Saiyami Kher) ఒకరు. చిన్నప్పటి నుంచి ఆరాధించిన సచిన్ తన సినిమాకు అభిమానిగా మారడంతో ఆమె ఆనందానికి ఆవధుల్లేవు. ఆమె నటనకు ప్రశంసలు కురిపించిన సచిన్.. ఆమె ఆటను స్వయంగా చూడాలనుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మహిళలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?: ఎమ్మెల్సీ కవిత
పదేళ్లుగా పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికీ పార్లమెంట్లో మహిశా సభ్యులు కేవలం 12 శాతమేనని చెప్పారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు 12శాతం మంది ఉన్నారన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Fake work: గంట పనికి.. రూ.కోట్ల జీతమా..?
‘ఫేక్ వర్క్’ (Fake work) ఇటీవల టెక్ పరిశ్రమలను వేధిస్తోంది. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్ (Fortune) పత్రిక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతడు రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్ల (రూ. 1.2 కోట్లు)ను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్గా మారడంతో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అసలు అతడు చేసే పనేంటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్.. త్రుటిలో తప్పించుకున్న చిరుత
తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. సుమారు 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగించారు. అయితే ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. చిరుత బోన్కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నాటి సోమయాన్.. వాజ్పేయీ సూచనతో ‘చంద్రయాన్’గా మారి..!
జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) అడుగుపెట్టే మహోన్నత ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చంద్రుడి (Moon)పై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో లూనార్ మిషన్ ఇది. అయితే జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు ‘చంద్రయాన్’ కాదట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఘోరం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి
మిజోరం(Mizoram)లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో దాదాపు 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాజధాని నగరం ఐజ్వాల్కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు