Chandrayaan-3: నాటి సోమయాన్.. వాజ్పేయీ సూచనతో ‘చంద్రయాన్’గా మారి..!
Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపడుతున్న ‘చంద్రయాన్’ ప్రయోగాలకు తొలుత పెట్టిన పేరు అదికాదట. మాజీ ప్రధాని వాజ్పేయీ సూచన మేరకు ఈ పేరును మార్చారు.
ఇంటర్నెట్ డెస్క్: జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా అడుగుపెట్టేసింది. చంద్రుడి (Moon)పై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో లూనార్ మిషన్ ఇది. అయితే జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు ‘చంద్రయాన్’ కాదట. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) సూచన మేరకు ఈ పేరును మార్చారట. ఈ మేరకు ఇస్రో మాజీ ఛైర్పర్సన్ డా. కె. కస్తూరిరంగన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను బయటపెట్టారు.
1999లో ఇస్రో (ISRO) ఛైర్మన్గా ఉన్న కస్తూరిరంగన్.. భారత్ చేపట్టే తొలి లూనార్ మిషన్ (Lunar Mission) ప్రయోగం అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్పేయీ.. మిషన్ పేరు గురించి అడిగారు. ఈ ప్రయోగానికి తాము ‘సోమయాన్ (Somayaan)’ అని పేరు పెట్టాలనుకున్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. సంస్కృతంలో ఓ శ్లోకం ఆధారంగా ఈ పేరు పెట్టారట. ఈ శ్లోకానికి.. ‘ఓ చంద్రుడా.. మేం మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం. మాకు దారిచూపు’’ అని అర్థం. అందుకే ఆ పేరు పెట్టామని కస్తూరిరంగన్.. వాజ్పేయీతో చెప్పారు.
దీనికి వాజ్పేయీ బదులిస్తూ.. లూనార్ మిషన్కు ‘చంద్రయాన్ (Chandrayaan)’ పేరైతే బాగుంటుందని సూచించారట. ‘‘ఇప్పుడు దేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మరిన్ని యాత్రలు చేయగలిగే సత్తా మనకుంది’’ అని వాజ్పేయీ ఆనాడు చెప్పారని కస్తూరిరంగన్ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
కాగా.. 2003లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాజ్పేయీ చారిత్రక ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రయోగం గురించి అధికారికంగా ప్రకటించారు. ‘‘మన దేశం ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సిద్ధంగా ఉంది. 2008 నాటికి మన వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపనున్నాం. ఆ మిషన్ పేరు చంద్రయాన్’’ అని నాడు వాజ్పేయీ ప్రకటన చేశారు.
ఆయన అన్నట్లుగానే.. తొలి చంద్రయాన్ ప్రయోగం కోసం ప్రణాళికలు రచించేందుకు నాలుగేళ్లు పట్టగా.. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు అంటే.. 2008లో అది జాబిల్లి వద్దకు దూసుకెళ్లింది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించడంతో ఆ ప్రయోగం విజయవంతమైంది. ఆ తర్వాత 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైంది. ఆ వైఫల్యాలను అధిగమిస్తూ ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!