Chadrayaan - 3: చంద్రయాన్ - 3 మిషన్ వెనుక వీళ్ల కృషి
41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అడుగుపెట్టింది. మరి చంద్రయాన్-3 మిషన్లో శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన కీలక వ్యక్తులు గురించి తెలుసుకుందామా!
బెంగళూరు: జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 (Chadrayaan-3) వ్యోమనౌక అడుగుపెట్టేసింది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. ఈ శాస్త్రవేత్తల బృందాలకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
ఎస్ సోమ్నాథ్ భారతి - ఇస్రో ఛైర్మన్
చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM-3) రూపకల్పనలో ఎస్ సోమ్నాథ్ భారతి కీలకంగా వ్యవహరించారు. 2022 జనవరిలో ఆయన ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అంతకముందు వరకు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరించారు. చంద్రయాన్-3తోపాటు త్వరలో ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్, సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్-3ల నిర్మాణం, ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్, డైనమిక్స్ డిజైన్, సెపరెషన్ సిస్టమ్ వంటి విభాగాల్లో ఈయనకు అపార అనుభవం ఉంది.
పీ వీరముత్తువేల్ - చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్
2019లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఈయన బాధ్యతలు చేపట్టారు. కొత్త రోవర్, ల్యాండర్ నిర్మాణం ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఐఐటీ మద్రాసు నుంచి సాంకేతిక విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. చంద్రయాన్-2 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వనితా ఆధ్వర్యంలో ఈయన పనిచేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉన్న స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, మంగళయాన్ మిషన్లో కూడా భాగస్వామ్యం అయ్యారు.
కె కల్పన - చంద్రయాన్-3 డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్
కల్పన చెన్నైలో బీటెక్ పూర్తయిన వెంటనే ఇస్రోలో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు. తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించారు. 2005లో బదిలీపై బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికెళ్లి అక్కడ విధులు నిర్వహించారు. ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈమె భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రాజెక్టు అసోసియేటెడ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ - డైరెక్టర్, వీఎస్ఎస్సీ
కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్ఎమ్వీ-3ని (గతంలో జీఎస్ఎల్వీ మార్క్-3గా పిలిచేవారు) వీఎస్ఎస్సీలో నిర్మించారు. చంద్రయాన్-2 మిషన్లో కూడా ఉన్నికృష్ణన్ వీఎస్ఎస్సీలోని తన బృందంతో కలిసి కీలక పాత్ర పోషించారు.
ఎమ్ శంకరన్ - డైరెక్టర్, యూఆర్ఎస్సీ
2021లో యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (URSC) డైరెక్టర్గా ఎమ్ శంకరన్ బాధ్యతలు చేపట్టారు. ఈయనను ఇస్రో పవర్హౌస్గా పరిగణిస్తారు. ఉపగ్రహాలకు అవసరమైన పవర్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంలో ఈయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. భారత దేశ అవసరాలకు తగినట్లుగా (కమ్యూనికేషన్, నావిగేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ పరిస్థితుల అంచనా, గ్రహాల అన్వేషణ) ఉపగ్రహాలను తయారు చేయడం యూఆర్ఎస్సీ బాధ్యత. భౌతికశాస్త్ర పట్టభద్రుడైన శంకరన్ చంద్రయాన్-3 మిషన్లో కీలకమైన ల్యాండర్ శక్తిని పరీక్షించేందుకు అసవరమైన చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్లో కూడా పనిచేశారు.
వీ నారాయణన్ - డైరెక్టర్, ఎల్పీఎస్సీ
తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (LPSC) డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్కు అవసరమైన థ్రస్టర్లను ఈయన నాయకత్వంలోనే అభివృద్ధి చేశారు. ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్స్ నిర్మాణంలో ఈయన నిపుణుడు.
బీఎన్ రామకృష్ణ - డైరెక్టర్, ఐఎస్టీఆర్ఏసీ
బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియలో ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ప్రక్రియను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. భారతదేశంలోని 32-మీటర్ల అతిపెద్ద డిష్ యాంటెనా ఈ కేంద్రంలోనే ఉంది. దీని సాయంతోనే శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్కు కమాండ్లు పంపుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?