Mizoram: ఘోరం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి
మిజోరం(Mizoram)లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది. దాంతో పలువురు మృతి చెందారు.
ఐజ్వాల్: మిజోరం(Mizoram)లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో దాదాపు 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాజధాని నగరం ఐజ్వాల్కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సర్జరీ చేసి పొట్టలో దూది వదిలేసిన వైద్యులు.. బాలింత మృతి!
నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. ప్రమాద సమయంలో అక్కడ 35 నుంచి 40 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వారిలో కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఐజ్వాల్ సమీపంలోని సైరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఘటన దృశ్యాలను షేర్ చేశారు.
మృతులకు ₹10లక్షల ఎక్స్గ్రేషియో: రైల్వే మంత్రి ప్రకటన
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ₹10లక్షలు, తీవ్ర గాయాలైన వారికి ₹2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో చెల్లించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మిజోరం ఘటన దురదృష్టకరమన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం, రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన వారికి ₹50వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు చెబుతున్నారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదని.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
మోదీ దిగ్భ్రాంతి..
వంతెన దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు