Fake work: గంట పనికి.. రూ.కోట్ల జీతమా..?
కొన్ని దిగ్గజ సాఫ్ట్ కంపెనీల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు తక్కువ శ్రమతో రూ. కోట్ల జీతాలను పొందుతున్నారంటూ ఫార్చ్యూన్ పత్రిక కథనం ప్రచురించింది. దీనికి ఆధారంగా రోజుకు గంట మాత్రమే పనిచేసి ఏటా రూ.1.2 కోట్ల వేతనం పొందుతున్న ఓ యువ ఉద్యోగి ఇంటర్వ్యూను కూడా ప్రచురించింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఫేక్ వర్క్’ (Fake work) ఇటీవల టెక్ పరిశ్రమలను వేధిస్తోంది. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్ (Fortune) పత్రిక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతడు రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్ల (రూ. 1.2 కోట్లు)ను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్గా మారడంతో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అసలు అతడు చేసే పనేంటంటే..
20 ఏళ్ల డేవాన్ (పేరు మార్చారు) అనే వ్యక్తి గూగుల్ (Google) ఉద్యోగి. అతడు రోజంతా కష్టపడకుండా కేవలం గంట మాత్రమే పని చేస్తానంటూ తెలిపారు. మేనేజర్ ఇచ్చే కోడ్ను పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందుకు అతడు కోడ్లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని తెలిపాడు. మిగిలిన పనిని వారం రోజుల్లోపు తాపీగా పూర్తి చేస్తానని వివరించాడు. అయితే, ఇందుకోసం రోజంతా కష్టపడకుండా వేగంగా కోడ్ను రాస్తానని.. దీని కోసం కేవలం గంట సమయాన్ని కేటాయిస్తానని తెలిపాడు. ‘‘ఉదయం అల్పాహారం అనంతరం గంట పాటు గూగుల్ కోసం పని చేస్తాను. దీని కోసం రోజంతా కష్టపడను. మిగిలిన సమయాన్ని నా స్టార్టప్ కోసం వినియోగిస్తున్నాను. మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్లో పని చేసే వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతుంటారు. రోజంతా కష్టపడకుండా చాలామంది ఇంజినీర్లు వేల జీతాలు పొందుతున్నారు. వారిలో నేను కూడా ఒకడినే’’ అని అన్నారు.
జాసన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కూడా గతంలో ఇన్సైడర్ ఇంటర్వ్యూ చేయగా.. అతడు వారానికి 30 గంటల కంటే ఎక్కువ పని చేయనని వెల్లడించారు. పనిభారం తక్కువగా ఉండడంతో అతడు రెండు ఫుల్టైం ఉద్యోగాలను చేస్తున్నట్లు వివరించాడు. ఒకవేళ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ఒక ఉద్యోగాన్ని వదిలేసేవాడినని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు