Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. సీఎంని రావొద్దని నేనే చెప్పా: కాంగ్రెస్ విమర్శలపై మోదీ స్పష్టత
శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీ(Modi)కి స్వాగతం పలికేందుకు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అందుకు ప్రధాని నరేంద్రమోదీనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉప్పుడు బియ్యంపై కీలక నిర్ణయం.. ఎగుమతులపై 20 శాతం సుంకం
ఉప్పుడు బియ్యం (parboiled rice) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం (export duty) విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘పుష్ప’ సినిమాలో నా ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు: చంద్రబాబు
అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలో తన ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా విలేకర్లతో జరిపిన ఇష్టాగోష్టిలో ఆయన (Chandrababu) ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లర్గా తన నటనతో మెప్పించిన అల్లు అర్జున్కు జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు.. వైకాపాలోని నిజమైన స్మగ్లర్లకు ఏ అవార్డు ఇవ్వాలి?’’ అని ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తెలంగాణకు కోకాకోలా మరిన్ని పెట్టుబడులు.. మంత్రి కేటీఆర్తో వెల్లడి
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ (Coca-Cola Company) నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్ (Minister KTR)కు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యారు. తమ సంస్థకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని, తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు జేమ్స్ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అమ్మానాన్న క్షమించండి.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అమ్మానాన్న క్షమించండంటూ.. ఓ బీటెక్ విద్యార్థి సూసైడ్ నోటి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ మధురానగర్లో ఈ ఘటన జరిగింది. మధురానగర్కు చెందిన ద్రితేక్షణ్ వర్మ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో సూసైడ్ నోట్ రాసి శనివారం ద్రితేక్షణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మైనంపల్లి ఇంటికి భారీగా అభిమానులు.. ఎమ్మెల్యే నిర్ణయంపై ఉత్కంఠ
మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అల్లూ వారి విల్లుకు.. తెలుగు వారి బాకీ చెల్లు: తనికెళ్ల భరణి
టాలీవుడ్లో చరిత్ర సృష్టిస్తూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu arjun) జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు రెండు రోజుల నుంచి ప్రశంసలు , శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపగా.. తాజాగా నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) తనదైన శైలిలో అల్లు అర్జున్కు విషెస్ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ట్రంప్ మగ్షాట్ ఫొటో.. అందంగా ఉన్నారంటూ బైడెన్ సెటైర్
అమెరికా చరిత్రలోనే మగ్షాట్ (Mug Shot) తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిలిచారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ట్రంప్ మగ్షాట్ ఫొటోపై సెటైర్ వేశారు. తాహోలోని వ్యాయామ క్లాస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 16వ వివాహ వార్షికోత్సవం.. యువగళంలో కేక్ కట్ చేసిన లోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 195వ రోజు కొనసాగుతోంది. నూజివీడు నియోజవకర్గంలోని పోతిరెడ్డిపల్లికి లోకేశ్ చేరుకున్నారు. అరిసెలతో తయారు చేసిన గజమాలతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇవాళ లోకేశ్, బ్రాహ్మణిల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా యువగళం వాలంటీర్లు, తెదేపా శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని గ్రామస్థులు లోకేశ్కు వినతిపత్రం అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. హమ్ చేస్తే మీకు నచ్చిన పాట.. యూట్యూబ్లో కొత్త ఫీచర్!
వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ (YouTube) మరో కొత్త ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్ సెర్చ్ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్లోని వాయిస్ సెర్చ్ ఫీచర్ ద్వారా సాంగ్ సెర్చ్ను యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్లోని హమ్ టు సెర్చ్ (Hum To Search) ఫీచర్ స్ఫూర్తితో ఈ ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్