Parboiled Rice: ఉప్పుడు బియ్యంపై కీలక నిర్ణయం.. ఎగుమతులపై 20 శాతం సుంకం
ఉప్పుడు బియ్యం (parboiled rice) ఎగుమతులపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. రెండు నెలల పాటు ఈ నిబంధన అమల్లో ఉండనుంది.
దిల్లీ: ఉప్పుడు బియ్యం (parboiled rice) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం (export duty) విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. అయితే, ఎల్ఈవో (let export order) జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్ పోర్టుల్లో లోడ్ చేసి ఉంచిన పార్బాయిల్డ్ రైస్ (parboiled rice)కు ఈ సుంకం వర్తించదని ఆర్థికశాఖ వెల్లడించింది. దీంతో పాటు సరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉన్న ఎగుమతులకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలా?.. ఇలా చేయండి..
ఇటీవల బాస్మతీయేతర బియ్యం (non-basmati rice) ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేయడంతో.. ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఉప్పుడు బియ్యం నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది.
మన దేశ బియ్యం ఎగుమతుల్లో బాస్మతియేతర తెల్ల బియ్యం వాటా 25శాతంగా ఉంటోంది. అయితే, దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో గత నెల బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్ల బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. అంతకుముందు నూకలపైనా నిషేధం విధించారు. ఇప్పుడు ఉప్పుడు బియ్యం ఎగుమతులపైనా సుంకం అమలు చేయడంతో.. అన్నిరకాల నాన్ బాస్మతీ రైస్ ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లయింది.
దేశీయ రిటైల్ మార్కెట్లో ఏడాది వ్యవధిలో బియ్యం ధరలు 11.5 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 15.54 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యం మన దేశం నుంచి ఎగుమతైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఎగుమతులు విపరీతంగా పెరగడం, దాని కారణంగా నిల్వలు తగ్గి దేశీయంగా ధరలు పెరగడంతో.. ఈ బియ్యం రకాలపై కేంద్రం నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీల అభివృద్ధి కోసం ఎంఅండ్ఎం రూ.12 వేల కోట్ల పెట్టుబడి
MEAL (మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్)లో రూ.12,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మహీంద్రా & మహీంద్రా అంగీకారం తెలిపింది. -
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే. -
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ