Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఈ-గవర్నెన్స్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలవటం లేదని, ప్రజా దర్బార్ నిర్వహించటం లేదని కొంతమంది చేస్తోన్న విమర్శలకు పురపాలక శాఖ మంత్రి బదులిచ్చారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తన వరకు వస్తుందని సీఎం అన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్లో శోధించి పథకం ప్రకారమే హత్య
నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య (Apsara Murder Case) రిమాండ్ రిపోర్టులో (Remand Report) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్లు తేలింది. గతేడాది ఏప్రిల్ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని, క్రమంగా అది వివాహేతర బంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. టికెట్ కోసం జగన్ను ఐదుసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎమ్మెల్యే మేకపాటి
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో లోకేశ్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్తో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాహుల్.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్ షా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన విదేశీ పర్యటనల్లో భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావిస్తుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్ తమ పూర్వీకుల నుంచైనా నేర్చుకోవాలని హితవు పలికారు. గుజరాత్ పాటన్ జిల్లాలోని సిద్ధ్పూర్లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సుప్రియా సూలే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కొత్తగా ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించారు. అయితే, ఇందులో కీలక నేత అజిత్ పవార్ (Ajit Pawar)కు చోటు దక్కకపోవడం గమనార్హం. తన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule), సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ (Praful Patel)కు పవార్ ఈ బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ChatGPT ఫౌండర్ సవాల్ను స్వీకరించిన టెక్ మహీంద్రా సీఈఓ!
టెక్ ప్రపంచంలో ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాట్జీపీటీ (ChatGPT) వచ్చిన తర్వాత ఈ రంగంలో పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అన్ని కంపెనీలు తమ ఏఐ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ (Sam Altman) భారత్లో పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రెండు వాహక నౌకలు.. 35కుపైగా యుద్ధవిమానాలతో విన్యాసాలు.. సత్తాచాటిన నౌకాదళం!
భారత నౌకా దళం (Indian Navy) తన సత్తాను మరోసారి చాటుకుంది. రెండు యుద్ధవిమాన వాహక నౌకలతోపాటు జలంతర్గాములు, ఇతర యుద్ధనౌకల కార్యకలాపాలను ఏకకాలంలో సమన్వయం చేస్తూ.. ‘ట్విన్ క్యారియర్ సీబీజీ ఆపరేషన్స్’ను విజయవంతంగా నిర్వహించింది. అంటే.. రెండు వాహక నౌకలతోకూడిన యుద్ధ బృందంతో ఏకీకృత కార్యకలాపాలు నిర్వహించడం. అరేబియా సముద్రంలో ఈ మేరకు విన్యాసాలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. శరద్ పవార్కు బెదిరింపులు.. పంపింది భాజపా కార్యకర్త..?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)కు ‘హత్య బెదిరింపులు’ రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై సత్వర దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ బెదిరింపు సందేశాలను అమరావతికి చెందిన భాజపా కార్యకర్త (BJP Activist) సౌరభ్ పింపాల్కర్ పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. చాట్జీపీటీ తప్పుడు సమాచారం.. కోర్టుకు సారీ చెప్పిన లాయర్
ఇంటర్నెట్లో సరికొత్త సాంకేతికత చాట్జీపీటీపై ఆధారపడుతున్నారా? దాన్ని అడిగే సమాచారం సేకరిస్తున్నారా? అయితే.. అది ఇచ్చే ఫలితాల్ని ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోండి. లేదంటే.. ఇబ్బందుల్లో పడతారు. తాజాగా చాట్జీపీటీని నమ్ముకున్న ఓ న్యాయవాది.. కోర్టులో న్యాయమూర్తి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. మాన్హట్టన్కు చెందిన ఓ వ్యక్తి విమాన సంస్థపై దావా వేశాడు. 2019లో కొలంబియన్ ఎయిర్లైన్కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సిబ్బంది కారణంగా తన కాలుకు గాయమైందని.. పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు