Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ.. చేసిన అభివృద్ధి శాశ్వతం: చంద్రబాబు
ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు విజన్ 420 అని అవహేళన చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భానుడి ఉగ్రరూపం.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. దీంతో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో గరిష్ఠంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మాతృదినోత్సవం రోజున దారుణం.. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
నగరంలోని మీర్పేటలో మాతృదినోత్సవం రోజే దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. విక్కీ (18 నెలలు), లక్కీ (8నెలలు)ని నీళ్ల తొట్టిలో ముంచేసి ఆ తర్వాత తల్లి భారతి (25) విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మాతృదినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పలువురి హృదయాల్ని కలచివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కర్ణాటక సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడేనా?
కర్ణాటక(Karnataka)లో విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ ప్రయత్నాలు మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధూ, డీకేఎస్ విడివిడిగా సమావేశం కావడం ఉత్కంఠ రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆయనతో విభేదాల్లేవ్.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా: డీకే శివకుమార్
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యతో (Siddaramaiah) తనకు ఎలాంటి విభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shiva kumar)స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేసి, సిద్ధ రామయ్య తరఫున నిలిచానని అన్నారు. 135 స్థానాల్లో విజయం సాధించి..ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. సీఎంగా ఎవరిని నియమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అమ్మా.. నాకు శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా
మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తులను గుర్తుచేసుకుంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. వారితో కలిసివున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రాజస్థాన్ ఆలౌట్.. బెంగళూరు సూపర్ విక్టరీ
ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆఫీస్లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
ఆఫీస్లో పని ఒత్తిడిగా అనిపిస్తే.. చాల మంది ఉద్యోగులు క్యాంటీన్కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్ అయ్యాక.. పబ్, బార్కో వెళ్లి రిలాక్స్ అవుతుంటారు. ఇకపై ఆఫీస్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్కు వెళ్లి బీర్ తాగొచ్చు. ఎక్కడంటారా? హరియాణాలో. ఈ మేరకు హరియాణా ప్రభుత్వం కార్పొరేట్ ఉద్యోగులు ఆఫీస్లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. తిరుపతి ‘వందే భారత్’ వేళల్లో మార్పు.. 16 బోగీలతో రైలు ఎప్పట్నుంచంటే?
సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది కోచ్లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్ రైలులో బోగీల సంఖ్యను రెట్టింపు చేసిన రైల్వే బోర్డు.. తాజాగా ఆ రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. అలాగే, ప్రయాణికుల అభ్యర్థన మేరకు పెంచిన 16 బోగీలతో ఈ రైలు మే 17 నుంచే పరుగులు పెట్టనుందట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. డగౌట్పై దాడి కాదు.. ఆటగాళ్లపైనే విసిరారు: జాంటీ రోడ్స్
ఉప్పల్ వేదికగా శనివారం రాత్రి హైదరాబాద్ - లఖ్నవూ (SRH vs LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకుల్లోని కొందరు తాము కూర్చున్న సీట్ నట్టులు, బోల్టులను తీసి లఖ్నవూ సూపర్ జెయింట్స్ డగౌట్పై విసరడంతో మ్యాచ్ను ఆరు నిమిషాలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్