Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షల కొత్త తేదీలివే..
గ్రూప్-2 పరీక్షల (TSPSC Group 2 Exams) రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు మాసానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రుషికొండపై దేవుడు ఉండాలి.. నేరగాళ్లు కాదు: పవన్
రుషికొండపై దేవుడు ఉండాలి.. నేరగాళ్లు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఆయన మాట్లాడారు. 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ను మరో 6 నెలలు భరించాలన్నారు. తనకు అండగా ఉంటే విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. హైదరాబాద్లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్
దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. రావెలలో ‘అమరావతి ఆక్రందన’ పేరుతో రాజధాని రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పంద్రాగస్టు వేళ.. బస్సు టికెట్లపై భారీ రాయితీలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టికెట్లో భారీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. హకీంపేట క్రీడా పాఠశాలలో ముగిసిన విచారణ
హకీంపేట క్రీడా పాఠశాల లైంగిక ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముగిసింది. ఓఎస్డీ హరికృష్ణ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోచ్లు, సిబ్బందిని కమిటీ ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. వారి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా స్టేట్మెంట్ తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: వైఎస్ షర్మిల
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఓదార్చారు. గద్దర్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటని అన్నారు. గద్దర్ సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సైరన్ స్థానంలో భారతీయ సంగీతం.. త్వరలో కొత్త పాలసీ: గడ్కరీ
మంత్రులు, వీఐపీల కార్లకు ప్రోటోకాల్లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై సైరన్ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వీఐపీలు వాహనాల్లో లేకపోయినా.. ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు సైరన్ మోగిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. విమానంలో భయానక అనుభవం..!
అమెరికా (America)లో ఓ విమానంలో ప్రయాణించినవారికి ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం (American Airlines) కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందికి దిగడం కలవరం రేపింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. చివరకు విమానం క్షేమంగా ల్యాండింగ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నియంతృత్వ పాలన సాగించడానికే కొత్త చట్టాల రూపకల్పన : కపిల్ సిబల్
దేశంలో నియంతృత్వ పాలన సాగించడానికే కేంద్ర ప్రభుత్వం నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైందని మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ (Kapil Sibal) విమర్శించారు. కొత్త బిల్లు ‘భారతీయ న్యాయ సంహిత’ (Bharatiya Nyaya Sanhita) రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మణిపుర్ అల్లర్లు.. సీబీఐ చేతికి మరో 9 కేసులు!
మణిపుర్ (Manipur) విధ్వంసానికి సంబంధించి మరో 9 కేసులను సీబీఐ (CBI) దర్యాప్తు చేయనుంది. దాంతో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే.. సీబీఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం కాబోదని ఉన్నతాధికారులు వెల్లడించారు. మహిళలపై నేరాలు, లైంగిక దాడులకు సంబంధించిన ఎలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా సీబీఐ వాటిని పరిగణలోకి తీసుకొని వేగంగా దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!