Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఓడిపోయినా.. ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది: రేవంత్రెడ్డి
తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దివాలా తీయించారని.. రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రజలకు ₹10 ఇచ్చి.. ₹100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇది: చంద్రబాబు
వైకాపా పాలనలో అందరూ బాధితులేనని.. అందులో తానూ ఉన్నానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జగన్.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు: షర్మిల
నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ న్యాయ సాధన సభ’కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. నాకంటే కష్టపడిన వాళ్లు ఉన్నారా? ఖమ్మం నుంచే పోటీ చేస్తా: వీహెచ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేసినట్లు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఫిబ్రవరి 23న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ కీ విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ (APPSC Group 2 Key) విడుదలైంది. 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. క్రికెట్లో రాజకీయ నేత జోక్యం.. ఇక ఆంధ్రకు ఆడను: హనుమ విహారి
భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి వెల్లడించాడు. క్రికెట్లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్స్టాలో విహారి పోస్టు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని తెలిపాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్
పాకిస్థాన్లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ (50) ఎన్నికయ్యారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్షరీఫ్ (Nawaz Sharif) కుమార్తె అయిన మరియం.. జనాభాపరంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్సు సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఉండదా..? బరిలోకి డి.రాజా సతీమణి
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్(Wayanad) నుంచి పోటీలో ఉండకపోవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్