Rahul Gandhi: వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఉండదా..? బరిలోకి డి.రాజా సతీమణి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈసారి వయనాడ్ నుంచి పోటీ చేసేలా కనిపించడం లేదు. ఆయన మరో స్థానాన్ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్(Wayanad) నుంచి పోటీలో ఉండకపోవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి. కర్ణాటక లేక తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్కు చెందిన రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్.. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో దిగిన కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లింగ్ లీగ్(IUML).. ఈసారి మూడు సీట్లు కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. మరోవైపు సీపీఐ తన పార్టీ ప్రముఖ నేత డి.రాజా(D Raja) సతీమణి యాని రాజాను అక్కడినుంచే బరిలోకి దింపింది. ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుంటే.. ఆ కూటమిలోని సీపీఐ అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. ఇది విపక్ష కూటమికి ఇబ్బందికర పరిణామమే. ఈ కారణాల వల్లే ఆయన వయనాడ్ను వదులుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రాహుల్ 2019లో తొలిసారి వయనాడ్(Wayanad) నుంచి పోటీ చేశారు. నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే ఉత్తర్ప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ.. భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్