Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1. ఆ గాలి మాటలను పట్టించుకోను: ప్రధానిమోదీ
గత 24 సంవత్సరాలుగా తనపై వస్తోన్న దుర్భాషలు వింటూనే ఉన్నానని.. చివరకు ఆ గాలి మాటలను పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. ఇప్పటివరకు 101 సార్లు విపక్షాలు తనను దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. గ్రానైట్ క్వారీ కూలి పది మంది మృతి
మిజోరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. హైకోర్టులో డేరా బాబాకు ఊరట..
డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద మతగురువు గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్కు పంజాబ్-హరియాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో మంగళవారం అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ సురేష్వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ బెంచ్ డేరా బాబా అప్పీల్ను పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. చెక్డ్యామ్లో ముగ్గురు యువకుల గల్లంతు
విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్డ్యామ్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోస్తనీ నది చెక్డ్యామ్కు మంగళవారం ఉదయం ఈత కోసం ఆరుగురు యువకులు వచ్చారు. మొదట ఒకరు మునిగి పోవడంతో రక్షించడానికి ఒకరి తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఇలా ముగ్గురు గల్లంతు కాగా.. మిగతావారు ఒడ్డుకు చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం, చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పది సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థుల అనాసక్తి..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు భారీగా గైర్హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో 20 వేల మంది విద్యార్థులు తప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరం: పవన్ కల్యాణ్
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు
తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నాకు ఆ వ్యాధి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’తో అన్ని భాషల వారికి చేరువయ్యారు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వాతావరణ మార్పులతో ఆరోగ్యంపై ప్రభావం
ఆరోగ్య పరిరక్షణలో తినే తిండి, చేసే వ్యాయామం, జీవనశైలి ఎంత ముఖ్యమో వాతావరణంది కూడా అంతే కీలక భూమిక. సీజన్ మారినపుడల్లా ఆరోగ్యంపై ప్రభావం పడడం సహజం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం