Arvind Kejriwal: ఈ చిత్రాన్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది: అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి సీమాను స్వగృహంలో కలిశారు. ఈమేరకు కోర్టు 6 గంటల పాటు ఆయనకు సమయం కల్పించింది. దీనికి సంబంధించిన చిత్రాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(X)లో పోస్టు చేశారు.
(Photo: Twitter)
దిల్లీ: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మనీశ్ సిసోదియా(Manish Sisodia) ఈ రోజు తన సతీమణి సీమాను స్వగృహంలో కలిశారు. సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసు (Delhi liquor scam case)లో అరెస్టయి కొన్ని నెలలుగా సిసోదియా తిహార్(Tihar Jail) జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలిసేందుకు సిసోదియాకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జైలు వ్యాన్లో పోలీసు సిబ్బందితో కలిసి దిల్లీలోని మథుర రోడ్లో ఉన్న తన నివాసానికి సిసోదియా వెళ్లారు.
కోర్టు అనుమతి ఇచ్చిన 6 గంటల సమయంలో సిసోదియా తన కుటుంబంతో గడిపారు. ‘చోటీ దిపావళి’ సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు. సమయం ముగిశాక ఆయన తిరిగి జైలుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో తన భార్యను ఆలింగనం చేసుకుని ఎంతో బాధతో వెనుదిరిగారు. ఈ చిత్రాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ఈ చిత్రాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దేశంలోని పేద చిన్నారులకు జీవితంపై ఒక ఆశ కల్పించిన వ్యక్తికి ఇలా అన్యాయం చేయడం సరైందేనా?’’ అని ప్రశ్నించారు.
దిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి, విద్య, ఎక్సైజ్ శాఖతో పాటు సిసోదియా పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవతవకలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా సిసోదియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో 26న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహాడ్ జైలులోనే ఉంటున్నారు. జూన్లో తన భార్యను కలిసేందుకు దిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆమె ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సిసోదియా ఆమెను అప్పుడు కలుసుకోలేకపోయారు. మద్యం కేసులో ఇటీవల సుప్రీంకోర్టు సిసోదియా బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది