Uddhav Thackeray: నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు....
ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదన్నారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘హిందుత్వ మా ఊపిరి. హిందుత్వ మా గుర్తింపు. మా భావజాలం. హిందుత్వం కోసం ఎవరేం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు. బాలాసాహెబ్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదు’’ అని స్పష్టం చేశారు. సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించానని.. కరోనా సమయంలో తమ కృషికి మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. మంత్రి ఏక్నాథ్ శిందేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తమను బలవంతంగా లాక్కెళ్లారని వారంతా వాపోతున్నారని ఉద్ధవ్ చెప్పారు.
‘మహా’ Updates..
- Maharashtra: శివసేన ఆదేశాలు చెల్లవు.. ఏక్నాథ్ శిందే ట్వీట్
- ‘నన్ను కిడ్నాప్ చేశారు’.. శివసేన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- కరోనాతో ఆసుపత్రిలో ‘మహా’ గవర్నర్.. అయినా కలిసే వెసులుబాటు..!
బాల్ఠాక్రే కుమారుడిని.. పదవికోసం వెంపర్లాడను
‘‘నన్ను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా.. నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నా. నేను బాల్ఠాక్రే కుమారుడిని.. పదవి కోసం వెంపర్లాడను. రాజీనామాకు సిద్ధమే. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కింది. సీఎం పదవి తీసుకోవాలని గతంలో శరద్ పవార్ నన్ను కోరారు. పవార్ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. సీఎం పదవి కోసం పోరాటం చేయను. సీఎంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. కొందరు ప్రేమతో గెలుస్తారు.. ఇంకొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు సీఎంగా కొనసాగాలని లేదు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటా’’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
సొంత ఎమ్మెల్యేలే వద్దునుకుంటే ఏం అనగలను?
‘‘ఇదంతా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీనో నన్ను సీఎంగా వద్దనుకుంటే అది వేరు. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కూడా నన్ను సీఎంగా ఉండాలని కోరారు. కానీ, నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు నేనేం అనగలను?. శివసైనికులంతా నాతో ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తంచేశారు.
గవర్నర్కు రెబల్ ఎమ్మెల్యేలు లేఖ
మరోవైపు, మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్నాథ్ శిందే జోరుగా పావులు కదుపుతున్నారు. తమదే అసలైన శివసేన అంటూ 30మంది ఎమ్మెల్యేలు గవర్నర్కు లేఖ రాశారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ శిందేను గుర్తించాలని కోరారు. శివసేన తన సిద్ధాంతంతో రెండేళ్ల క్రితమే రాజీపడిపోయిందని ఆరోపించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అవినీతిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుతం జైలులో ఉన్న అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ పేర్లను ప్రస్తావించారు. ఈ తీర్మానంలో మొత్తం 34మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా.. వీరిలో నలుగురు స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో అవినీతిపై శివసేన సభ్యులు, పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?