Pegasus: కోర్టులో విచారిస్తుంటే.. సోషల్మీడియాలో చర్చలెందుకు?
న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలపై పలు
దిల్లీ: న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సోషల్మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది.
‘‘పెగాసస్ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇతర మాధ్యమాల వేదికగా సమాంతర చర్చలు జరగడం దురదృష్టకరం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు. కానీ కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడే విచారణ జరగాలి. కోర్టుల్లో విచారణలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. కోర్టు హాళ్లలో క్రమశిక్షణతో చర్చలు జరగాలి. వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరించాలి. ఏం చెప్పాలనుకున్నా కోర్టులోనే చెప్పాలి. పిటిషనర్లు చెప్పే విషయాలు అపిడవిట్ రూపంలో ఇవ్వాలి. సోషల్ మీడియా, బయటి చర్చలకు పరిధి ఉండాలి. అలాంటి మాధ్యమాల్లో పిటిషనర్లు సమాంతర చర్చలు జరపకూడదు’’ అని జస్టిస్ ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలకు ఇరుపక్షాల న్యాయవాదులు స్పందిస్తూ.. కక్షిదారులు పరిధి దాటకుండా చూస్తమన్నారు. సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూసుకుంటామని చెప్పారు.
పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గతవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పిటిషనర్లలో ఒకరైన సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్పై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
విచారణ సోమవారానికి వాయిదా..
మరోవైపు పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నుంచి తనకు ఇంకా సూచనలు రావాల్సి ఉందని, అందువల్ల వాదనలకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు. -
ఖైదీ కడుపులో సెల్ఫోన్
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ సెల్ఫోన్ మింగేశాడు. తనకు కడుపునొప్పి వస్తోందని నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. స్థానిక ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. -
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు.