Akshay Kumar: పృథ్వీరాజ్‌ రాజసం

‘సూర్యవంశీ’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నారు అక్షయ్‌కుమార్‌. ఆయన నుంచి రాబోతున్న మరో చిత్రం ‘పృథ్వీరాజ్‌’. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా నటించారు అక్షయ్‌.

Updated : 16 Nov 2021 06:38 IST

‘సూర్యవంశీ’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నారు అక్షయ్‌కుమార్‌. ఆయన నుంచి రాబోతున్న మరో చిత్రం ‘పృథ్వీరాజ్‌’. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా నటించారు అక్షయ్‌. సోమవారం ఈ సినిమా టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో సంజయ్‌దత్‌, సోనూ సూద్‌ పాత్రల్ని కూడా పరిచయం చేశారు. చంద్ర ప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్‌ కథానాయికగా నటిస్తోంది. ‘‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా తెరపై కనిపించడం గర్వంగా ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 21న మీ మందుకొస్తుంది’’అని ట్వీట్‌ చేశారు అక్షయ్‌. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని