Anandh devarakonda: యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని ఉదయ్ శెట్టి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. కరిష్మా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటిస్తూ.. చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ను పంచుకుంది. ‘‘ఆనంద్కు ఇది తొలి యాక్షన్ చిత్రం. దీంట్లో చక్కటి ప్రేమకథకు చోటుంది. ఇది ఈ వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
అల్లుడు హీరో.. ఆమిర్ నిర్మాత..
అగ్ర హీరో ఆమిర్ఖాన్ నిర్మాతగా.. ఆయన మేనల్లుడు ఇమ్రాన్ఖాన్ కథానాయకుడిగా ‘హ్యాపీ పటేల్’ అనే చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో స్టాండప్ కమెడియన్, నటుడు వీర్దాస్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో ఇమ్రాన్ఖాన్ తెరపై కనిపించనున్నారు. వినోదం ప్రధానంగా ఇది తెరకెక్కనుందని సోమవారం సన్నిహితవర్గాలు తెలిపాయి. షూటింగ్ ఇప్పటికే గోవాలో ప్రారంభమైనట్టు సమాచారం. ఇమ్రాన్ఖాన్ చివరిసారి కంగనా రనౌత్తో కలిసి ‘కట్టీ బట్టీ’ అనే చిత్రంలో కనిపించాడు.
ఉత్థాన పతనాల నడికర్
తెలుగు అగ్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్లు మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై అలన్ ఆంటోనీ, అనూప్ వేణుగోపాల్లతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘నడికర్’. ‘2018’ ఫేం టొవినో థామస్ ఇందులో కథానాయకుడు. లాల్ జూనియర్ తెరకెక్కిస్తున్నారు. మే 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సోమవారం ట్రైలర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సినిమా సూపర్స్టార్ డేవిడ్ పడిక్కల్గా కనిపించారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అగ్ర తారగా నిలిచిన ఆయన..అనుకోని కొన్ని చిక్కుల్లో ఇరుక్కొని పాతాళానికి పడిపోయిన వైనం ఇందులో చూపించారు. ఈమధ్యలో పలికించిన భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. భావన, సౌబిన్ సాహిర్, సురేశ్కృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జబర్దస్త్’ కెవ్వు కార్తిక్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటుడు
కెవ్వు కార్తిక్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. -
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త సినిమా రాక... థియేటర్ నిండక...
వేసవి వినోదం అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది... సినిమానే. సుదీర్ఘంగా సాగుతుంది ఈ సీజన్. స్టార్ హీరోల చిత్రాలు...పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు... -
దిమాక్ కిరికిరి
‘కిరాక్ పోరి వస్తే సైట్ మార్... ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్పా మార్... ఇదే నా స్టైల్’ అంటున్నాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. -
ఆరుతో అదృష్టం కలిసిరావాలి
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్ యువకథానాయిక జాన్వీ కపూర్. -
అహం.. కలహం
దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రమిది. -
ఆ హత్యల వెనక ఒక్కడు?
ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్పైకి!
‘మలైకోటై వాలిబన్’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్లాల్. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన. -
ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!