మహేష్తో కలిసి నటించాలని ఉంది: మాళవికా మోహన్
మాళవికా మోహనన్ తమిళ చిత్రసీమలో కథానాయికగా రాణిస్తోంది. ఆమె రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్ట’ చిత్రంలో సహాయక పాత్రలో అలరించింది.
ఇంటర్నెట్ డెస్క్: మాళవికా మోహనన్ తమిళ చిత్రసీమలో కథానాయికగా రాణిస్తోంది. ఆమె రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో సహాయక పాత్రలో అలరించింది. ఈ మధ్యే విడుదలైన విజయ్ చిత్రం ‘మాస్టర్’లో హీరోయిన్గా నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘‘తెలుగు నటుడు మహేష్బాబుతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట’’ వెల్లడించింది.
హీరో మహేష్బాబు - మాళవికా మోహన్ల ఫోటోను ట్వీటర్ వేదికగా ఓ అభిమాని షేర్ చేస్తూ..‘‘ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది వేచి చూస్తున్నారు’’ అని అడగ్గా.. మాళవిక స్పందిస్తూ..‘నేను కూడా’ అంటూ చేయి ఎత్తిన ఏమోజీని ట్వీటర్ వేదికగా పంచుకుంది. ఇక మహేష్బాబు అభిమానులు అయితే ‘‘మీ కోసం మేం కూడా ఎదురుచూస్తున్నాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మాళవికా మెహన్ ధనుష్ కథానాయకుడిగా ‘డి43’ వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. మాళవిక ఎవరో కాదు మహేష్ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన కె.యు.మోహనన్ కుమార్తె.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్