Akshay Kumar: మే9 నుంచి పృథ్వీరాజ్‌ పోరు

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడు. అతడి సరసన మానుషి ఛిల్లర్‌ నటిస్తోంది. సంజయ్‌ దత్‌, సోనూసూద్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Updated : 06 May 2022 14:05 IST

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడు. అతడి సరసన మానుషి ఛిల్లర్‌ నటిస్తోంది. సంజయ్‌ దత్‌, సోనూసూద్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. బీ టౌన్‌ వర్గాల కథనం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్‌ మే 9న విడుదల కానుంది. ఆ రోజు చిత్రబృందంతో నిర్వహించనున్న భారీ కార్యక్రమంలో ఈ   ట్రైలర్‌ను ప్రదర్శిస్తారని సమాచారం. కొవిడ్‌ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా జూన్‌ 3న ‘పృథ్వీరాజ్‌’ యుద్ధ సాహసాలను మన ముందుకు తీసుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని