TS High court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది.

Published : 01 May 2024 16:26 IST

హైదరాబాద్‌: దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు, షాద్‌నగర్‌ తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దిశా నిందితుల  ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్‌ కమిషన్‌ వేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని విచారించిన కమిషన్‌.. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని పేర్కొంది. కమిషన్‌ నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈమేరకు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని