Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్ ప్రారంభం నుంచీ ఒకే తరహా పాత్రల్లో నటించడంతో బోర్ ఫీలయ్యాయని నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాలో గ్లామర్ డోస్ పెంచడంపై ఎదురైన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా ఇది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల వేడుక నిర్వహించింది. అనుపమతోపాటు సిద్ధు, మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. మీడియాతో వారు పంచుకున్న సంగతులివీ..
* ఓ వైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికల హీట్ మొదలైంది. సినిమా విడుదలకు ఇది సరైన సమయం అనుకుంటున్నారా?
నాగవంశీ: మార్చి చివరకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఎన్నికలు మేలో ఉన్నాయి. గుడ్ఫ్రైడే సెలవును దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
* తమన్కు బదులు భీమ్స్ నేపథ్య సంగీతం అందించడానికి కారణం?
నాగవంశీ: వేసవి కానుకగా ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఫస్ట్ చూపించాలనుకుని మార్చి 29ని ఫిక్స్ చేశాం. ఆ లోపు పనులన్నీ పూర్తవ్వాలి. తమన్ బిజీగా ఉండడంతో భీమ్స్ని తీసుకున్నాం.
* ఈ చిత్రం విషయంలో మీరు గ్లామర్ డోస్ పెంచినట్లున్నారు?
అనుపమ: అందంగా కనిపించడం మంచిదే కదా (నవ్వుతూ). నా కెరీర్లో నేను పోషించిన పాత్రల్లో లిల్లీ (ఈ సినిమాలోని క్యారెక్టర్) ప్రత్యేకం. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ప్రారంభించా. అంతకుముందు నాకున్న పరిధుల దృష్ట్యా కొన్ని క్యారెక్టర్లు ప్లే చేయలేకపోయా. అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడంతో బోర్ ఫీలయ్యా. ఏదైనా పెర్ఫామెన్స్కు స్కోప్ ఉంటేనే చేస్తా తప్ప హీరోయిన్ ఇమేజ్ కోసం కాదు.
* ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత కొన్ని పేర్లు వినిపించాయి. వాళ్లెందుకు చేయలేదో తెలుసుకుని మీరు ఈ చిత్రాన్ని అంగీకరించారా? కథ నచ్చి నటించారా?
అనుపమ: నా దగ్గరకు కథ వచ్చింది. నాకు నచ్చింది. లిల్లీ పాత్రను వదులుకోకూడదనుకుని నటించా. మిగతా విషయాలు తెలియదు. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో నటించేటప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఆ తర్వాత తెలుగులో ‘అ ఆ’లో నటించా. నా కెరీర్ ప్రారంభమై దాదాపు పదేళ్లవుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం తప్పు కదా (నవ్వుతూ).
* హిట్ సినిమాకి సీక్వెల్ అంటే ఒత్తిడి ఉంటుంది. ఆ భయమే అడల్ట్ డోస్/యూత్ డోస్ను పెంచేలా చేసిందా?
సిద్ధు: యూత్ డోస్ ఓకేగానీ మేం అడల్ట్ డోస్ అనడం సరైంది కాదు. ఒక్కో సినిమాకి ఒక్కో థీమ్ ఉంటుంది. ఇందులో డీజే టిల్లు క్లాస్గా కనిపిస్తే చూసే మీకు, చేసే మాకు వినోదం ఉండదు. ఆ క్యారెక్టర్ మోసపోవడం, బాధపడడం కూడా యూత్ డోసే. మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలం.
* దర్శకుడి గురించి చెబుతారా?
సిద్ధు: ఈ సినిమాని చేద్దామనుకునే సమయానికి విమల్ కృష్ణ (డీజే టిల్లు దర్శకుడు) మరో ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు. అప్పటికే నేను, మల్లిక్ రామ్ వేరే కథా చర్చల్లో ఉన్నాం. ‘టిల్లు స్క్వేర్’కి అతడు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనిపించింది.
* టైటిల్ ఆలోచన ఎవరిది?
సిద్ధు: ఆ ఆలోచన దర్శకుడు త్రివిక్రమ్ది. మేం ‘టిల్లు బ్యాక్’, ‘టిల్లు రిటర్న్స్’లాంటి టైటిల్స్ అనుకుంటుంటే ఆయన ‘టిల్లు స్క్వేర్’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!