Deepika Padukone: అలా అడగడం స్టుపిడ్గా ఉంది..
వివాహం అనంతరం కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంటారు కథానాయికలు. అప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో కనిపించినా.. పెళ్లి తరువాత సంప్రదాయ పాత్రలకే పరిమితమవుతుంటారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆ సరిహద్దులన్నింటినీ చెరిపేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తొలిసారి పూర్తిస్థాయి రొమాంటిక్, బోల్డ్ కంటెంట్ చిత్రం ‘గెహ్రాహియా’తో పలకరించనుంది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్గా మారింది ఈ చిత్రం ఈనెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది దీపిక. కాగా ఓ జాతీయ మీడియా ఛానెల్కు ఇంటర్వ్యూలో.. ‘‘ ‘గెహ్రాహియా’లో బోల్డ్ సీన్స్లో నటించడానికి మీ భర్త రణ్వీర్ సింగ్ అనుమతి తీసుకున్నారా’’ అని ప్రశ్నించగా.. దీపిక మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా కథంతా మోడ్రన్ డే రిలేషన్షిప్స్తో ముడిపడి ఉంటుంది. కాబట్టే అలా నటించాల్సి వచ్చింది. బోల్డ్ సీన్స్లో నటించేందుకు నా భర్త అనుమతి తీసుకున్ననా లేదా దానికి ఆయన ఎలా స్పందించారు అని అడగటం స్టుపిడ్గా ఉంది. ముఖ్యమైన విషయమేమిటంటే.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్ను మేము అసలు చదవం. రణవీర్ కూడా అంతే’’ అని ఘాటుగా బదులిచ్చింది.
‘గెహ్రాహియా’లో తన భార్య దీపిక నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ ఇటీవలే రణ్వీర్ చెప్పుకొచ్చాడు. ట్రైలర్ను షేర్ చేసి దీపిక నటనకు ప్రశంసలు కురిపించాడు. దీపికా పదుకొణె- సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు. కేవలం ఓటీటీ కోసమే ఈ చిత్రాన్ని దర్శకుడు షకున్ బత్రా మిత్ రాయ్ కథ అందించగా కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మిస్తోంది. నసీరుద్దీన్ షా, రాజాత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్