Travis Head: ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాద్ తరఫున తొలిసారి ఆడుతున్న ట్రావిస్ హెడ్ (Travis Head) పెను సంచలనాలకు బెంగళూరు బ్రేకులు వేసింది. అతడిని తొలి ఓవర్లోనే పెవిలియన్కు పంపి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. హెడ్ బలహీనతను జాగ్రత్తగా అధ్యయనం చేసిన బెంగళూరు ఈ సారి వ్యూహాత్మకంగా బౌలింగ్లో పావులను కదిపింది. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ను అనూహ్యంగా రంగంలోకి దింపి ఫలితం సాధించింది. అతడు వేసిన తొలి ఓవర్ చివరి బంతి హెడ్ బ్యాట్ అంచును తాకి కర్ణ్ శర్మ చేతిలోకి వెళ్లడంతో హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఈ ఆస్ట్రేలియా సంచలన బ్యాటర్ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అతడు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అవస్థలు పడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సీజన్లో అతడు స్పిన్నర్లను ఆడి 15.75 సగటుతో 63 పరుగులు చేశాడు. ఆ సమయంలో స్ట్రైక్ రేట్ 150. ఇక సీమర్లను ఎదుర్కొని అతడు ఏకంగా 262 పరుగులు సాధించాడు. ఆ సమయంలో కళ్లు చెదిరేలా 236 స్ట్రైక్ రేటుతో 87.33 సగటున పరుగులు సాధించాడు. ఓపెనర్ కావడంతో సీమర్లకు మూడు సార్లు వికెట్ సమర్పించుకున్నా.. వేగంగా వచ్చే బంతులను అద్భుతంగా ఆడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు సారథి ఫాఫ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ జాక్స్ చేతికి బంతిని ఇచ్చి ఆరంభ ఓవర్ వేయించి ఫలితం సాధించాడు.
ఈ సిరీస్లో హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. మొత్తం 46.42 సగటుతో 325 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 212. వీటిల్లో ఒక శతకం.. రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 5లో కొనసాగుతున్నాడు.
2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన హెడ్ ఆసీస్ జట్టులో మంచి మార్కులు కొట్టేశాడు. తొలుత మిడిల్ ఆర్డర్లో ఆడిన అతడు సీమర్లు, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ, 2020లో అతడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. నాడు ఆసీస్ మాజీ ఇయాన్ ఛాపెల్ కూడా హెడ్ ఆట తీరును విమర్శించాడు. 2022లో పాకిస్థాన్, శ్రీలంక సిరీసుల్లోనూ స్పిన్ బౌలింగ్లో తడబడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు