Hyderabad: హైదరాబాద్‌ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని,

Updated : 06 Aug 2022 09:16 IST

అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ వర్సిటీ బంపర్‌ ఆఫర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్‌ అమెరికాలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఈ నెల 12న వేదాంత్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17 మంది నోబెల్‌ పురస్కార గ్రహీతలను అందించిందన్నాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్‌ ఫీజు మేరకు స్కాలర్‌షిప్‌ లభించిందన్నారు. నాన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారని వేదాంత్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు