Aruna Miller: అమెరికాలో మన అరుణోదయం
ప్రపంచ రాజకీయాల్లో మన వాళ్ల హవా నడుస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు చరిత్ర సృష్టించింది. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా కాట్రగడ్డ అరుణ మిల్లర్.. నిలిచారు. రాజకీయాలంటే ఆసక్తి లేని ఈ తెలుగు తేజం.. ఈ స్థాయి వరకూ ఎలా వచ్చారో చదివేయండి.
ప్రపంచ రాజకీయాల్లో మన వాళ్ల హవా నడుస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు చరిత్ర సృష్టించింది. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా కాట్రగడ్డ అరుణ మిల్లర్.. నిలిచారు. రాజకీయాలంటే ఆసక్తి లేని ఈ తెలుగు తేజం.. ఈ స్థాయి వరకూ ఎలా వచ్చారో చదివేయండి.
‘నేనో ఇంజినీర్ని. రాజకీయవేత్తను కాదు’.. 2010 ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అవకాశమొచ్చినప్పుడు అరుణ అభిప్రాయమిది. ఈవిడది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా వెంట్రప్రగడ. అమ్మ హేమలత. నాన్న కాట్రగడ్డ వెంకట రామారావు ఇంజినీర్. ఆయన ఉద్యోగరీత్యా వీళ్లు 1972లో అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటికి తనకు ఏడేళ్లు. అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాల్లో రవాణా ఇంజినీర్గా పని చేశారు. 1990లో మేరీల్యాండ్ మాంట్ గొమెరీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి మారారు. స్నేహితుడు డేవ్ మిల్లర్ని పెళ్లాడారు. మొదట్నుంచీ సామాజిక సేవపై ఆసక్తి. పాఠశాలలు, ఉపాధి, కమ్యూనిటీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు. వికలాంగులు, పాదచారులు, సైకిల్ నడిపేవారికి అనువుగా ఉండేలా రూపొందించిన కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. పాతికేళ్లు సేవలందించి 2015లో ఉద్యోగ విరమణ చేశారు.
2000లో అమెరికా పౌరసత్వాన్ని పొందిన అరుణ ఆ ఏడాదే మొదటిసారి ఓటు వేశారు. ‘ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. కొంత భావోద్వేగానికీ గురయ్యా’నని చెబుతారు. అయితే తను మద్దతు తెలిపిన అభ్యర్థి ఓడిపోయారు. తర్వాతా అదే పరిస్థితి. దాన్ని తట్టుకోలేక ఆమె కార్యకర్తగా మారారు. డెమొక్రటిక్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆమె చురుకుదనం, పేరు ప్రఖ్యాతులకు మెచ్చి 2010లో మేరీల్యాండ్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున డెలిగేట్గా పోటీ చేసే అవకాశమిస్తే ఆమె తిరస్కరించారు. ‘నీ లక్ష్యం ప్రజాసంక్షేమం. రాజకీయ నాయకులు చేసేదీ అదే కదా’ అన్న భర్త మాటలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలి పోటీలోనే గెలిచి, మేరీల్యాండ్కు తొలి భారతీయ అమెరికన్ డెలిగేట్ అయ్యారు. అమెరికాలో పెరిగినా భారతీయ మూలాలను ఎప్పటికీ మరవలేదంటారు ఆమె సన్నిహితులు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. మొదటిసారి గెలిచాక తన రాష్ట్ర గవర్నర్ని భారత్కి తీసుకొచ్చి పలు వ్యాపార విభాగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదిర్చారు.
2014లోనూ రెండోసారి డెలిగేట్గా ఎన్నికయ్యారు. రెవెన్యూ, రవాణా మొదలైన కీలక కమిటీల్లో సభ్యురాలయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసిన తొలి మహిళ.. హిల్లరీ క్లింటన్ బృందంలో ఈవిడా ఒకరు. చీర, నుదుటిమీద ఎర్రటి బొట్టుతో ప్రపంచ దృష్టీ ఆకర్షించారు అరుణ. 2018లో ప్రతినిధుల సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజా గెలుపుతో మళ్లీ సత్తా చాటారు. బైడెన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడూ అరుణ చురుగ్గా ప్రచారం చేశారు. అందుకేనేమో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్నా బైడెన్, కమలా హ్యారిస్లు ఆమె తరఫున ప్రచారం చేశారు. చదువుకునే హక్కు, పాఠశాలలో ‘లేబర్ డే’, పర్యావరణ విధానాల్లో మార్పులు, విచ్చలవిడిగా ఆయుధాల లభ్యత వంటి ఎన్నింటిపైనో ఆవిడ పోరాడారు. తన కృషి ఫలితంగా కొన్ని విధానాలూ రూపొందాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులూ ఆమెకు మద్దతివ్వడం విశేషం. ‘సాధించడానికి అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా ఏమీ ఉండదనే వారు నాన్న. నచ్చింది చేయమని నన్ను, చెల్లిని ప్రోత్సహించారు. ఆ తోడ్పాటే దూసుకెళ్లే మనస్తత్వాన్ని అలవరించింది. నా ముగ్గురు అమ్మాయిలకీ ఇదే చెబుతుంటా’ అనే 58 ఏళ్ల అరుణని మేరీల్యాండ్ వాసులు ‘ఫైర్ బ్రాండ్’గా అభివర్ణిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?