జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు.
అమెరికా: డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు వైకాపా సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కలిసి కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసి బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఈ కీలక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా తమ సహాయసహకారాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్ పాలనలో గత ఐదేళ్లుగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో రౌడీల పాలన సాగుతోందని.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని.. కోలుకోవాలంటే ఎంతో సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాల్లేవని, ఉద్యోగులకు సైతం జీతాలు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.
జనసేన, తెదేపా నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), పంతం నానాజీ (జనసేన), ఆరిమిల్లి రాధాకృష్ణ(తెదేపా), జ్యోతుల నెహ్రూ(తెదేపా) ఈ సమావేశానికి జూమ్ వేదికగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ఏడాది నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు చీలిపోకూడదని ఒకే నినాదాన్ని చెబుతూ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే, ఈ మూడు పార్టీల పొత్తు ఆవశ్యకతను ఎన్నారైలకు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కూటమిని దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, అధికార పార్టీకి వ్యతిరేకంగా జనం ఉన్నారన్నారు. డబ్బులు ఇచ్చినా వైకాపాకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఈసారి వైకాపాకు కేంద్రం, భారాసల నుంచి ఎలాంటి మద్దతు ఉండదన్నారు. వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా డబ్బు దోచుకుందని, ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని నాయకులు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ అమలుచేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారని జగన్ కోసం వాలంటీర్లు మాత్రమే పనిచేస్తారని తెలిపారు.
తమ మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా ఈ కీలక సమయంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య 100శాతం ఓటు బదిలీ జరగాలని ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ నిస్వార్థ సేవల్ని ప్రశంసించారు. సీట్ల రాజీ కోసం తనను తాను తగ్గించుకున్నారని, కూటమి ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో బలోపేతం కావాలని, ఎన్నికల సమయంలో సరైన ప్రచారం చేయాలని సూచించారు. తాము కూడా ఇక్కడినుంచి ప్రజలను ప్రభావితం చేస్తామని, కూటమి నేతలు, క్యాడర్కు అవసరమైన సాయం అందిస్తామని ఎన్నారైలు పేర్కొన్నారు. కులమతాలకతీతంగా తాము కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వారి గెలుపునకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి దర్శికి చెందిన జనసేన నేత ఎన్నారై వెంకట్ హాలు, విందు ఏర్పాటుచేయగా.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావాలని పలువురు ఆకాంక్షించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకట్ కేకు కట్ చేశారు. ఈసందర్భంగగా పలువురు మద్దతుదారులు జనసేన, తెదేపా, భాజపా కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరినీ సమన్వయం చేయడంలో డల్లాస్ బాబి, సురేష్ లింగినేని, శ్రీరామ్ మత్తి , కిశోరె అనిచెట్టి, జనసేన డల్లాస్ నేతల బృందం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. సుగుణ్ చాగర్లమూడి, కేసీ చేకూరి, లోకేష్ కొణిదెల, చింతమనేని సుధీర్, చలసాని కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో తెదేపా నుంచి పాల్గొని ప్రసంగించారు. అలాగే, భాజపా నుంచి ప్రవల్లిక హాజరై వాలంటీర్ వ్యవస్థలో అవకతవకలపై ప్రస్తావించారు. సజిత తిరుమలశెట్టి యాంకరింగ్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు