జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు.
అమెరికా: డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు వైకాపా సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కలిసి కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసి బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఈ కీలక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా తమ సహాయసహకారాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్ పాలనలో గత ఐదేళ్లుగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీలో రౌడీల పాలన సాగుతోందని.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని.. కోలుకోవాలంటే ఎంతో సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాల్లేవని, ఉద్యోగులకు సైతం జీతాలు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.
జనసేన, తెదేపా నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), పంతం నానాజీ (జనసేన), ఆరిమిల్లి రాధాకృష్ణ(తెదేపా), జ్యోతుల నెహ్రూ(తెదేపా) ఈ సమావేశానికి జూమ్ వేదికగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ఏడాది నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు చీలిపోకూడదని ఒకే నినాదాన్ని చెబుతూ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే, ఈ మూడు పార్టీల పొత్తు ఆవశ్యకతను ఎన్నారైలకు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కూటమిని దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, అధికార పార్టీకి వ్యతిరేకంగా జనం ఉన్నారన్నారు. డబ్బులు ఇచ్చినా వైకాపాకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఈసారి వైకాపాకు కేంద్రం, భారాసల నుంచి ఎలాంటి మద్దతు ఉండదన్నారు. వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా డబ్బు దోచుకుందని, ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని నాయకులు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ అమలుచేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారని జగన్ కోసం వాలంటీర్లు మాత్రమే పనిచేస్తారని తెలిపారు.
తమ మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా ఈ కీలక సమయంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య 100శాతం ఓటు బదిలీ జరగాలని ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ నిస్వార్థ సేవల్ని ప్రశంసించారు. సీట్ల రాజీ కోసం తనను తాను తగ్గించుకున్నారని, కూటమి ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో బలోపేతం కావాలని, ఎన్నికల సమయంలో సరైన ప్రచారం చేయాలని సూచించారు. తాము కూడా ఇక్కడినుంచి ప్రజలను ప్రభావితం చేస్తామని, కూటమి నేతలు, క్యాడర్కు అవసరమైన సాయం అందిస్తామని ఎన్నారైలు పేర్కొన్నారు. కులమతాలకతీతంగా తాము కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వారి గెలుపునకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి దర్శికి చెందిన జనసేన నేత ఎన్నారై వెంకట్ హాలు, విందు ఏర్పాటుచేయగా.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావాలని పలువురు ఆకాంక్షించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకట్ కేకు కట్ చేశారు. ఈసందర్భంగగా పలువురు మద్దతుదారులు జనసేన, తెదేపా, భాజపా కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరినీ సమన్వయం చేయడంలో డల్లాస్ బాబి, సురేష్ లింగినేని, శ్రీరామ్ మత్తి , కిశోరె అనిచెట్టి, జనసేన డల్లాస్ నేతల బృందం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. సుగుణ్ చాగర్లమూడి, కేసీ చేకూరి, లోకేష్ కొణిదెల, చింతమనేని సుధీర్, చలసాని కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో తెదేపా నుంచి పాల్గొని ప్రసంగించారు. అలాగే, భాజపా నుంచి ప్రవల్లిక హాజరై వాలంటీర్ వ్యవస్థలో అవకతవకలపై ప్రస్తావించారు. సజిత తిరుమలశెట్టి యాంకరింగ్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.