Yuvagalam: ‘యువగళం’ పాదయాత్ర ఉత్తుంగ తరంగంలా సాగాలి: సతీశ్‌ వేమన

‘యువగళం’ పాదయాత్ర చేపడుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు వైకుంఠనాథుని దివ్యాశీస్సులు మెండుగా ఉండగాలని తానా మాజీ అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు సతీశ్‌ వేమన ఆకాంక్షించారు.

Published : 26 Jan 2023 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యువగళం’ పాదయాత్ర చేపడుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు వైకుంఠనాథుని దివ్యాశీస్సులు మెండుగా ఉండగాలని తానా మాజీ అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు సతీశ్‌ వేమన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లోకేశ్‌కు శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆయన బహూకరించారు. ఈ సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్ర ఉత్తుంగ తరంగంలా ముందుకు సాగాలని.. ఏపీలో ప్రభంజనం సృష్టించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తనకు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎన్‌ఆర్‌ఐ సోదరులకు లోకేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పినట్లు సతీశ్‌ వేమన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని