Qatar: ఖతర్‌లో తెదేపా విజయోత్సవ సంబరాలు

ఖతర్‌లో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 06 Jun 2024 13:39 IST

ఖతర్‌: ఖతర్‌లో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెదేపా నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరై, కూటమిని గెలిపించిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ప్రజలు గడిచిన 5 ఏళ్లగా నరకం చూశారని, రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేశానికి తలమాణికమని, ఈ ఘన విజయం తెదేపా కార్యకర్తల కఠోర శ్రమ ఫలం, వారి త్యాగాలకు, అధినాయకులు చంద్రబాబు నిరంతర కృషికి, అలుపెరగని పోరాటానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబుకు ప్రజలంతా సహకరించాలని ఆకాక్షించారు. ప్రవాసులు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, విదేశీ ఉద్యోగ కల్పనలో తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. గడిచిన 5 ఏళ్లుగా పార్టీ గెలుపుకు తమవంతు కృషిచేసిన ప్రవాస నాయకులను, శ్రేణులను, తమ ఓటు హక్కును వినియోగించుటకు రాష్ట్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు. అల్ ది వెరీ బెస్ట్ నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నినాదాలతో గ్రూప్ ఫొటోలతో దిగ్విజయంగా ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని