చిన్న సంతకంతో పోయేదానికి ఎందుకంత రచ్చ?
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే...
తిరుమల డిక్లరేషన్ అంశంపై ఎంపీ రఘురామ వ్యాఖ్య
దిల్లీ: ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే తమ పార్టీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. తితిదేలో వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందన్నారు. గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం తితిదే ఛైర్మన్కు లేదన్నారు. సీఎం జగన్ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు. డిక్లరేషన్ విషయంలో చిన్నసంతకంతో పోయే దానికి ఎందుకింత రచ్చ అని వ్యాఖ్యానించారు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
నాపై అనర్హత వేటు వేయించడం సాధ్యంకాదు
రాష్ట్రంలో రైతుభరోసా అమలులో ఆలస్యం జరుగుతోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. డిమాండ్కి తగ్గట్టుగా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు తనను బహిష్కరించలేదని.. వారధిగా భావిస్తున్నారని చెప్పారు. ఒకట్రెండు నెలల్లోనే తనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని.. తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.