కాంగ్రెస్ భేటీ నేడు.. ఆత్మశోధనకు కాదా?
దేశ ప్రజలు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగ వ్యాఖ్యలు చేసినా కూడా.. హస్తం పార్టీ ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లు కన్పించడం లేదు. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక అడ్వైజరీ
ఎజెండాలో బిహార్ లేదంటోన్న పార్టీ వర్గాలు
దిల్లీ: దేశ ప్రజలు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగ వ్యాఖ్యలు చేసినా కూడా ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లు కనిపించడం లేదు. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ మంళవారం భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. సిబల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇందులో బిహార్ ఫలితాల అంశం ఎజెండాలో లేదని, సాధారణ పాలనా సమస్యలపై చర్చించేందుకే సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించడం గమనార్హం.
పార్టీ అధినాయకత్వ వైఖరిని తప్పుబడుతూ ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ అడ్వైజరీ కమిటీనీ ఏర్పాటు చేశారు. కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ భేటీకి సోనియాగాంధీ దూరంగా ఉండటంతో బిహార్ ఫలితాలపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం.
బిహార్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్లో మరోసారి అసంతృప్త గళాలు వినిపించాయి. పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగంగానే అధిష్ఠానం వైఖరిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్కే చెందిన మరో నేత కార్తీ చిదంబరం కూడా సిబల్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. కాగా.. సిబల్ వ్యాఖ్యలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఖండించారు. పార్టీ అంతర్గత విషయాలపై నేతలు మీడియాకు ఎక్కడం ఆక్షేపణీయమని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు