Bandi Sanjay: ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది?: బండి సంజయ్
మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 14 వరకు భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనపై లఘు చిత్రమాలికను భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో పెద్ద కుంభకోణాలు బయటపడ్డాయని.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు.
‘‘కరోనా సమయంలో దేశాన్ని మోదీ కాపాడారు. లాక్డౌన్ విధించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సిన్ అందించారు. ఉపాధి కోల్పోయిన వాళ్లకోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా కేంద్రం బియ్యం పంపిణీ చేసింది. పేదల కోసం దేశవ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను కేంద్రం ప్రభుత్వం నిర్మించింది. రెండు పడకగదుల ఇళ్ల పేరుతో పేదలను కేసీఆర్ వంచించారు. ఇప్పటి వరకు కనీసం 10వేల ఇల్లు కూడా తెరాస ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో నీరుగార్చారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం పెద్దపీట వేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కలను సాకారం చేసింది. కాశీని మోదీ అద్భుతంగా అభివృద్ధి చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. తెలంగాణను శ్రీలంకలా తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. శ్రీలంకలో కుటుంబ పాలన తరహాలో ఇక్కడా కేసీఆర్ కుటుంబం పాలిస్తోంది. పేరు ప్రఖ్యాతల కోసం సీఎం పాకులాడుతున్నారు. వెంచర్ల పేరుతో భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటోంది’’ అని బండి సంజయ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు