Chidambaram: వారికి చరిత్రపై అవగాహన లేదు..దానిని తిరగరాయాలని చూస్తున్నారు..!
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణంగానే గోవా విముక్తి ఆలస్యమైందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం ఖండించారు. ఈ వ్యాఖ్యలనీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నమన్నారు. గోవా విముక్తి కోసం నెహ్రూ సరైన సమయంలోనే జోక్యం చేసుకున్నారని తెలియజేశారు.
పనాజీ: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణంగానే గోవా విముక్తి ఆలస్యమైందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం ఖండించారు. ఈ వ్యాఖ్యలనీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నమన్నారు. గోవా విముక్తి కోసం నెహ్రూ సరైన సమయంలోనే జోక్యం చేసుకున్నారని తెలియజేశారు.
‘మోదీ, అమిత్షాకు స్వాతంత్య్రానంతర చరిత్ర తెలీదు. ముఖ్యంగా 1947 నుంచి 1960 మధ్య విషయాలపై అవగాహన లేదు. జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని ఎంత నేర్పుగా నడిపారో వారికి తెలిసుండదు. ఆ సమయంలో భారత్ శాంతికాముక దేశంగా, అలీనోద్యమ కూటమికి పెద్దగా పేరుపొందింది. గోవా విముక్తి విషయంలో నెహ్రూ సరైన సమయంలో జోక్యం చేసుకున్నారు. అందుకే మిలిటరీ చర్యకు వ్యతిరేకంగా ఒక్క గొంతుకూడా వినిపించలేదు. అలాగే భవిష్యత్తును నిర్ణయించేందుకు అభిప్రాయ సేకరణ(ఒపినీయన్ పోల్) నిర్వహించారు. అందుకే గోవా ఈనాడు స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. మోదీ, అమిత్ షా ఏం చెప్పినా, చరిత్రను వక్రీకరించి తిరగరాయాలని చూసినా.. గోవా ప్రజలు నెహ్రూ వ్యవహరించిన తీరును ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని చిదంబరం భాజపా విమర్శలను తోసిపుచ్చారు.
గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. నెహ్రూ తలుచుకుంటే కొన్ని గంటల్లోనే గోవా స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన 15 సంవత్సరాలకు అది పోర్చుగీసు పాలననుంచి బయటపడిందన్నారు. భాజపా అగ్రనేత అమిత్ షా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!