Perni Nani: అర్హత లేనివాళ్లు ప్రశ్నించినంత మాత్రాన వ్యతిరేకత కాదు: పేర్ని నాని
మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
గన్నవరం: మహానాడు నిర్వహించే అర్హత తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రుల బస్సు యాత్ర మహానాడుకు పోటీకాదని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 2024లోనే వైకాపా ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పేర్నినాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు ఎలా వచ్చేవారో బస్సుయాత్ర సందర్భంగా అలాగే వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉండేదని.. చేతల్లో కనబడేది కాదని పేర్కొన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందని చెప్పారు. గడిచిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో జగన్ గెలిచారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 60శాతానికి పైగా ఓట్లు వచ్చాయని చెప్పారు. మిగతా 40మంది వ్యతిరేకించారని.. అలాంటి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అర్హత లేకపోయినా ఫలానా పథకం రాలేదని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించినంత మాత్రాన అది వ్యతిరేకత కాదన్నారు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఉద్యోగులు అడిగినంత పీఆర్సీని ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. ఆశించిన మేర ఇవ్వలేకపోతున్నట్లు జగన్ నిజాయతీగా చెప్పారని పేర్నినాని తెలిపారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు