ర్యాలీ చేసి తీరుతాం: అమర్‌నాథ్‌రెడ్డి

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించి తీరుతామని తెదేపా నేత అమర్‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.కొన్ని షరతులతో పోలీసులు ర్యాలీకి అనుమతిచ్చినట్లు...

Updated : 11 Jan 2020 15:49 IST

రేణిగుంట: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించి తీరుతామని తెదేపా నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని షరతులతో పోలీసులు ర్యాలీకి అనుమతిచ్చినట్లు చెప్పారు. నాలుగుకాళ్ల మండపం వద్దకు వెళ్లవద్దని ఎస్పీ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ర్యాలీ ఆపాలనే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, అమరావతి పరిరక్షణకు పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని