అభివృద్ధికి మండలి ఎక్కడ అడ్డు?: రామకృష్ణ
రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇతర రాష్ట్ర ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మూడు కాదు రాష్ట్రానికి హైదారాబాద్తో కలిపి...
విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇతర రాష్ట్ర ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మూడు కాదు రాష్ట్రానికి హైదరాబాద్తో కలిపి నాలుగు రాజధానులు అని రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారని, శాంతియుతంగా ఉండే తెనాలి లాంటి చిన్న పట్టణాల్లో కూడా అలజడులు జరుగుతున్నాయన్నారు. మండలిలో జరిగిన నిర్ణయం నేరమైనట్టు మండలి రద్దు తీర్మానం చేశారని మండిపడ్డారు.
ఫిరాయింపులను ప్రోత్సహించను అని చెప్పి మూడు రోజులు మండలి సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని రామకృష్ణ దుయ్యబట్టారు. అభివృద్ధికి మండలి అడ్డుపడుతోందని సీఎం చెబుతున్నారని.. ఎక్కడ అడ్డుపడిందని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేస్తామంటే మండలి అడ్డు వచ్చిందా?లోటు బడ్జెట్, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తామంటే అడ్డుపడిందా? అని నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించే దమ్ము లేక మండలి రద్దు ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని రామకృష్ణ ఆరోపించారు. ఈ ప్రభుత్వం బెదిరింపులు, ప్రలోభాలతో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.