20 రోజులుగా నా భర్త కనిపించడంలేదు
పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేదిస్తుందని....
అహ్మదాబాద్: పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు. ఇలా ఎంతకాలం ఆయన్ను మా నుంచి వేరు చేస్తారు. 2017లో పాటీదారులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం హార్దిక్ పటేల్ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ప్రస్తావించకుండా హార్దిక్ను ప్రభుత్వం అడ్డుకుంటోంది’’ అని వీడియోలో ఆమె ఆరోపించారు.
అయితే చివరగా ఈ నెల 11న హార్దిక్ దిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద్ కేజ్రివాల్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 10న ట్విటర్ వేదికగా ఆయన గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నాలుగు సంవత్సరాల క్రితం గుజరాత్ పోలీసులు నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. దాని గురించి లోక్సభ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ను కేసు వివరాలు గురించి అడగ్గా, నాపై కేసు లేదని చెప్పారు. కానీ 15 రోజుల క్రితం నన్ను అదుపులోకి తీసుకొనేందుకు నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు