ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితం
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్
ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో వైకాపా ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిధులను దారి మళ్లించడమే కాకుండా అడ్డగోలుగా బుకాయిస్తోందని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెల్లి సమితి ప్రతినిధులు ఆదివారం మనోహర్ను కలిశారు. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని, ఉప ప్రణాళిక నిధులు తమకు చేరడం లేదని వివరించారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం వెళ్తే మైగ్రేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కార్మికుల సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయనతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మనోహర్ వారికి హామీ ఇచ్చారు.
* ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం నాయకులు ఆదివారం నాదెండ్ల మనోహర్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తమ వర్గం బలంగా ఉన్న చోట రాజకీయ ప్రాధాన్యమివ్వాలని కోరారు. అత్యంత వెనకబడిన కులమైన తమను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమస్యలపై పవన్ కల్యాణ్తో చర్చిస్తానని మనోహర్ వారికి హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు