విపక్షాల నిరసనలతో పార్లమెంటు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం సయితం సజావుగా సాగలేదు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అనర్హత అంశాలపై విపక్ష సభ్యులు మరోసారి గళమెత్తారు.
దిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం సయితం సజావుగా సాగలేదు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అనర్హత అంశాలపై విపక్ష సభ్యులు మరోసారి గళమెత్తారు. ప్రభుత్వతీరుకు నిరసనగా నల్లవస్త్రాలు ధరించి వచ్చిన పలువురు సభ్యులు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. లోక్సభ తొలుత సమావేశమైనప్పుడు విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ సభ్యులు కొన్ని పత్రాలను చించి, స్పీకర్ స్థానం వైపు విసిరారు. నల్లని కండువాలను కొందరు విసరగా, వాటిని మార్షల్స్ అడ్డుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న పి.వి.మిథున్రెడ్డి.. సభ్యుల తీరును తప్పుబట్టారు. ఒకేఒక్క నిమిషంలోనే మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. రెండోసారి సమావేశమైన తర్వాత కూడా.. అదానీపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ కోసం విపక్షం డిమాండ్ చేసింది. సభాపతి స్థానం వద్దకు సభ్యులు చేరుకుని బైఠాయించారు. గందరగోళ పరిస్థితుల మధ్యే కొన్ని నివేదికలను, పత్రాలను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ‘సేవ్ డెమోక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అని రాసిన నినాద ఫలకాలు ప్రదర్శిస్తూ సభ్యులు నిరసన కొనసాగించడంతో ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి.. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఒకసారి వాయిదాపడి, మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైంది. ఏయే బిల్లులను చర్చకు చేపట్టబోయేదీ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ చెబుతుండగా విపక్షాలు అడ్డుపడి నిరసనలు తెలిపాయి. దీంతో సభ వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు